అమరావతి తాత్కాలిక సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి : వచ్చే డిసెంబర్ నాటికి తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసి రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అక్కడే నిర్వహించబోతున్నట్టు ఏపీ సర్కార్ చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే సచివాలయ నిర్మాణంలో మళ్లీ కూల్చివేతల పర్వం మొదలవడం పలు ఆరోపణలకు తావిస్తోంది.
స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. సీఎం చంద్రబాబుకు నచ్చకపోవడమో, వాస్తు సరిగా లేకపోవడమో ఈ తాజా కూల్చివేతలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో నిర్మిస్తోన్న సీఎం కార్యాలయం, అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని పలు గోడలు కూల్చివేసి కాంట్రాక్టులు మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.

గతంలో సచివాలయంలోని 4,5 బ్లాకుల్లోను ఇలాగే కొన్ని నిర్మాణాలు కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఇలా కూల్చివేస్తూ మళ్లీ నిర్మాణాలు చేపడుతూ పోతుంటే నిర్మాణ వ్యయం కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ఇప్పటికే సచివాలయ నిర్మాణం కోసం రూ.750 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం.
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీ సర్కార్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుపుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీసారి కూల్చివేతలు చేపడుతూ నిర్మాణాలు చేపట్టడమేంటని విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications