అందుకే విభజన వ్యతిరేకిస్తున్నా, రాజకీయంకాదు: కిరణ్
దేశంలో ఎక్కడా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విభజన వల్ల అన్ని ప్రాంతాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందని అందుకే విభజన నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో తాను చెబుతున్నానని తెలిపారు. తాను రాజకీయాల కోసం మాట్లాడటం లేదన్నారు.
విడిపోతే సాగునీరుకు సీమాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. రైతులకు జరిగే నష్టాన్ని పూడ్చలేమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు ముఖ్యమంత్రి శుక్రవారం ఫోన్ చేసి ఢిల్లీ పెద్దల ప్రకటనలపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. విభజన వంటి ప్రధాన అంశం పైన మీరు, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలు వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారని, ఇది సరికాదని డిగ్గీతో చెప్పారు.