ఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తి
అమరావతి: ఓ జాతీయ పార్టీ దక్షిణాదిపై ఆపరేషన్ ద్రవిడ, తెలుగురాష్ట్రాలపై ఆపరేషన్ గరుడ ప్రారంభించిందని సంచలన విషయాలు చెప్పిన నటుడు శివాజీ మరో ఆసక్తికర విషయం కూడా తెలిపారు. పార్లమెంటులో శుక్రవారం ఏం జరనుందో చెప్పారు.
చదవండి: ఏపీ ప్రభుత్వంపై ఓ జాతీయ పార్టీ పెద్ద కుట్ర.. నటుడు శివాజీ షాకింగ్
లోకసభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టబోతున్నారని తెలిపారు. దీనికి సంబంధించి తనకు స్పష్టమైన సమాచారం అందిందన్నారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం సభను నిర్వహించబోతున్నారని చెప్పారు.
చదవండి: ఏపీ సహా దక్షిణాదిపై కేంద్రం ఆపరేషన్ గరుడ, ద్రవిడ
ఆరుగురు మాట్లాడుతారు
కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు లోకసభలో మాట్లాడుతారని శివాజీ చెప్పారు. వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని తెలిపారు. ఈ ఆరుగురు కూడా అనర్గళంగా దడదడ లాడిస్తారని, ఏపీకి ఏం చేశామో చెబుతారని తెలిపారు.
అవిశ్వాసం ఇలా వీగిపోతుంది
మన ఎంపీలకు ఇంగ్లీషు పెద్దగా రాదనే భావన ఢిల్లీలో ఉందని శివాజీ అన్నారు. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని తెలిపారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారని, అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారన్నారు.
ఏపీ ప్రభుత్వం కూల్చివేత, అల్లర్లకు కుట్ర
ఏపీ టార్గెట్గా ఓ ఆపరేషన్ ప్రారంభించిన జాతీయ పార్టీ సెప్టెంబర్ 1వ తేదీలోగా ఏపీ ప్రభుత్వాన్ని కూల్చుతారని, బీహార్, ఒడిశా మనుషులతో ఏపీలో అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని, కొన్ని ఒత్తిళ్లతో కొత్త నాయకుడిని కేంద్రమంత్రిగా పంపేలా పథకం రూపొందించారని, ఓ జాతీయ పార్టీ నేతను సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నారని, ఓ ముఖ్య నాయకుడిపై దాడికి గుంటూరు, హైదరాబాదులలో రెక్కీ నిర్వహించారని శివాజీ అనుమానం వ్యక్తే చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహేష్ కత్తి స్పందించారు.
పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తి
బీజేపీ దక్షిణాదిన పాగా వెయ్యాలని చూస్తోందని, ఇక్కడ లీడర్లు ఉన్నారు కానీ కేడర్ లేదని, అందుకే అధికార పార్టీని ముంచి ప్రతిపక్షాన్ని తుంచి, కొత్తగా ఏదో సాదిద్దామనుకుంటోందని, అదే ఆపరేషన్ ద్రావిడలో గరుడ అని, మనం బిజీగా ఒకరిని మరొకరు వేసుకుంటూ ఉంటే వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారని చెప్పారు.