తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలకు తూతూ మంత్రంగానే కేటాయింపులు..

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలకు నామమాత్రపు కేటాయింపులతో బడ్జెట్ సరిపెట్టారు.

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు విద్యాపరంగా నామమాత్రపు కేటాయింపులే దక్కాయి. కొత్తగా ఏర్పాటు కాబోయే వాటికి కూడా తూతూ మంత్రంగానే కేటాయింపులు జరిగాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం తాత్కాళిక అద్దె భవనంలో కొనసాగుతున్న ఎన్ఐటీకి శాశ్వత భవనం నిర్మించాల్సి ఉంది. అయితే తాజా బడ్జెట్ లో దీనికి కేవలం రూ.10కోట్ల నిధులు మాత్రమే కేటాయించడంతో.. ఇప్పట్లో శాశ్వత భవనం అసాధ్యంగా మారింది. నిజానికి ఈ పదికోట్ల రూపాయాలు కాంపౌండ్ వాల్ కు కూడా సరిపోవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Major educational institutes in telugu states get nominal funds in budget

ఏపీ-తెలంగాణల్లో ఆయా విద్యా సంస్థలకు కేంద్రం కేటాయించిన బడ్జెట్ వివరాలు:

ఐఐటీ ఆంధ్రప్రదేశ్: 50కోట్లు
ఐఐటీ హైదరాబాద్: 75కోట్లు
ఐఐఎం ఆంధ్రప్రదేశ్: 40కోట్లు
ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్: 10కోట్లు
ఏపీ-తెలంగాణ గిరిజన యూనివర్సిటీలు: 20కోట్లు
సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్: 10కోట్లు
ఐఐఐటీ, ఆంధ్రప్రదేశ్: 30కోట్లు
ఐఐఎస్ఈఆర్, ఆంధ్రప్రదేశ్: 50కోట్లు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+