విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొబ్బరి బొండాల కత్తితో దాడి: పోలీసుల అదుపులో నిందితుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కొబ్బరి బొండాల కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందుతున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో తూర్పు ఏసీపీ రమణ ఈ వివరాలను వెల్లడించారు.

రామ్‌నగర్‌లో నివసిస్తోన్న గుడేల జగదీష్ (60), శ్రీహరిపురం దరి ఇందిరానగర్ కాలనీకి చెందిన గళ్లా పొలిపిల్లి అలియాస్ చిన్నా (46) మధ్య వ్యాపారా లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. చిన్నా గతంలో జగదీష్‌కు రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చారని, ఆ తర్వాత మరి కొన్నిసార్లు వీరిమధ్య సొమ్ము ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయన్నారు.

Man arrested in visakhapatnam

ఈ నేపథ్యంలో తనకు రూ. 30 లక్షల వరకూ నగదు ఇవ్వాలని చిన్నా ఆరోపించగా, గతంలో అప్పుగా తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేశానని జగదీష్ చెబుతున్నారు. ఇద్దరి మధ్య మస్పర్ధలు రావడంతో శుక్రవారం ఉదయం చిన్నా, జగదీష్ దుకాణానికి వచ్చి, ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీనిపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందుతున్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నామని పోలీసులు వివరించారు. ఏపీ31 సీడబ్ల్యూ3699 నెంబర్ కలిగిన ఒక కారు, కొబ్బరి బొండాల కత్తి, ముసుగు టోపీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

English summary
Man arrested in visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X