టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని అన్నాహజారే టీం సభ్యుడి డిమాండ్!
అమరావతి: టీడీపీ ఎంపీలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నాహజారే జట్టు సభ్యులుగా చెప్పుకున్న ఒకరు టీడీపీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ లోకసభ, రాజ్యసభ ఎంపీలు అందరూ రాజీనామా చేసేవరకు, సీఎం చంద్రబాబు మనసు మారే వరకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
ఆయన తొలుత లెనిన్ సెంటర్లో జాతీయ జెండాతో కాసేపు నిరసన తెలిపారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆమరణ దీక్ష చేపడతానని కరపత్రాలు పంచారు. అరెస్టు చేసి జైల్లో పెట్టినా దీక్ష కొనసాగిస్తానన్నారు. అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రాత్రి విడుదల చేశారు.

ఏపీకి హోదా ఉద్యమ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగు సెగ బాగానే తగలబోతోంది. బీజేపీపై ఇక్కడ ఉన్న వ్యతిరేకత కర్నాటకలోని తెలుగువారి రూపంలోను కనిపిస్తుందని అంటున్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటుతో బుద్ధి చెబుతారంటున్నారు.
ఏపీకి హోదా నిరాకరణ, విభజన హామీల విస్మరణ వంటి కారణాలతో కర్ణాటకలోని ఏపీ వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తరాల కిందటే ఇక్కడికి తరలివచ్చిన తెలుగువారితో పాటు ఉపాధి కోసం వచ్చినవారు చాలామంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారట.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications