వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లయిన పక్షం రోజులకే భార్యని హత్య చేసిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ కిరాతక భర్త తన భార్యను పొట్టన పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకున్న 15 రోజులకే భార్యను హత్య చేసి మాయ చేసేందుకు ప్రయత్నించాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మద్దూరు మండలం రెనిపట్లలో జరిగింది.

రెనిపట్ల గ్రామానికి చెందిన గోవిందమ్మ (19)కు అమ్మానాన్నలు లేరు. అన్నయ్యనే అన్నీ అయి పదిహేను రోజుల క్రితం పెళ్లి చేశాడు. మద్దూరుకు చెందిన గోపాల్ (25) అనే వ్యక్తికి 31,500 నగదు, 3 తులాల బంగారం కట్నంగా ఇచ్చి ఆమెను కట్టబెట్టాడు.

Man kills wife in Mahaboobnagar

వ్యవసాయం పనులు, ఉపాధి హామీ పనులు చేసుకునే గోపాల్‌పై గతంలో చిన్నపాటి దొంగతనాలకు సంబంధించిన కేసులున్నాయి. గోవిందమ్మ మంగళవారంనాడు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు బాగానే ఉన్నట్లు కనిపించింది.

తెల్లారిసరేకల్లా గోవిందమ్మ ఉరేసుకున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన గోవిందమ్మ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

English summary
A person has killed his wife Gopalamma in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X