పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం, సీసీటీవీల్లో రికార్డ్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఓ వ్యక్తి నడి రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇవి అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అతను కిరోసిన్ పోసుకొని, నిప్పు అంటించుకున్నాడు. గాయాలపాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు.
కాగా, మహాలక్ష్మినాయుడు భార్యను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది.
Comments
English summary
Man suicide attempt at Pendurthi Police Station on Wednesday morning.
Story first published: Wednesday, January 10, 2018, 13:16 [IST]