భార్య అలా ప్రచారం చేయడంతో..: పిడుగురాళ్లలో యువకుడి ఆత్మహత్య
పిడుగురాళ్ల: తమకు పిల్లలు పుట్టరని భార్య అందరికీ ప్రచారం చేస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. పిడుగురాళ్ల పట్టణంలోని రావెళ్ల హోటల్ బజారులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పిడుగురాళ్లలో పీడబ్ల్యూడీ కాలనీలో భార్య భవానీతో కలిసి కేతరాజుపల్లి వెంకటేశ్వర్లు(23) కాపురం ఉంటున్నాడు. ఇతని స్వగ్రామం నుదురుపాడు కాగా.. ఉపాధి కోసం పిడుగురాళ్లకి వచ్చి స్థిరపడ్డాడు. తమకు పిల్లలు పుట్టరని ఇటీవల తన భార్య చుట్టుపక్కల వారికి ప్రచారం చేస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందాడు.

ఈ నేపథ్యంలోనే రావెళ్ల హోటల్ పక్కవీధిలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వెళ్లి శుక్రవారం ఉరివేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రవీంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని భార్య, తల్లిదండ్రులకు ఫోన్ సమాచారం ఇచ్చి వారిని కూడా రప్పించారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications