టిటిడి రేసులో జ్యోతుల, ఢిల్లీ నుంచీ ఒత్తిడి: రాయపాటి తీవ్ర నిర్ణయం!?
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా నటుడు, ఎంపీ మురళీ మోహన్ దాదాపు ఖరారయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం చాలామంది రేసులో ఉన్నారు.
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా నటుడు, ఎంపీ మురళీ మోహన్ దాదాపు ఖరారయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం చాలామంది రేసులో ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా బడా పారిశ్రామికవేత్తల పేర్లతో సిఫార్సులు వస్తున్నాయని తెలుస్తోంది.
బాబుకు మరో తలనొప్పి: రాయపాటి కొత్త ట్విస్ట్, మురళీ మోహన్ ఒత్తిడి?
కానీ మురళీ మోహన్ పేరు దాదాపు ఖరారయిందని అంటున్నారు. ఆయన తదుపరి చైర్మన్గా నియమితులయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. టిటిడి చైర్మన్ రేసులో మురళీ మోహన్తో పాటు చాలామంది ఉన్నారు.
రాయపాటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారా?
ప్రధానంగా ఎంపీ రాయపాటి సాంబశివ రావు రేసులో ఉన్నారు. ఆయనకు ఈసారి కూడా పదవి దక్కకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. అలాగే రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతారని, అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ఆచితూచి
ప్రస్తుత టిటిడి పాలక మండలి ఛైర్మన్ పదవీకాలం గత నెల 26తో ముగిసింది. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపిక అనివార్యమైంది. ఈ పదవి కోసం చాలామంది పార్టీ సీనియర్లు పోటీపడుతుండటంతో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
రేసులో వైసిపి నుంచి వచ్చిన జ్యోతుల
టీటీడీ పాలకమండలి ఛైర్మన్ రేసులో ఎంపిలు రాయపాటి, మురళీమోహన్, జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, జ్యోతుల నెహ్రూ, బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఆశావహుల జాబితాలో ఉన్నారు.
ఒత్తిళ్లు
ఢిల్లీ నుంచి కూడా బడా పారిశ్రామికవేత్తల పేర్లతో సిఫార్సులు వస్తున్నాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ ఎంపిక చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్లో తనకు అన్యాయం జరిగిందని, టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తానన్న హామీ మీదనే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బాహాటంగా ప్రకటించారు.
ఈసారి బీజేపీకివ్వాలని..
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనని తెలుస్తోంది. మిత్రపక్షం బీజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగరాజు కూడా టిటిడి ఛైర్మెన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి బిజేపీకి అవకాశం కలిపించాలని కోరుతున్నారు.
ఉత్తర భారత్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ను టిటిడి కొత్త ఈవోగా నియమించడం ఒత్తిడే కారణమనే ప్రచారం సాగుతోంది. చైర్మన్ పదవి విషయంలో చంద్రబాబు చివరికి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది.