నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అతనే, మంత్రులకు కూడా తెలియదు: వెంకయ్య
విజయవాడ: తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి ఉంటే భారత్ ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు. మహాత్మా గాంధీ సూచన మేరకు పటేల్ ప్రధాని పదవిని వదులుకున్నారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పటేల్ ఎంతో కృషి చేశారన్నారు.

దురదృష్టవశాత్తూ ఆయనను భారతరత్నగా గుర్తించడానికి చాలా ఏళ్లు పట్టిందన్నారు. అన్నీ గుణగణాల కలబోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అన్నారు. సర్దార్ పటేల్ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు.
నవతరానికి, యువతరానికి ఆయన ఎవరో తెలియదని, ఆయన జీవితం గురించి తెలియదన్నారు. మీలోనే కాదు, వివిధ రాష్ట్రాలలోను ఉండే చాలామంది మంత్రులకు కూడా పటేల్ గురించి తెలియదన్నారు. పటేల్ 564 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన నేత అన్నారు. పట్టుదలకు ఆయన ప్రతీక అన్నారు.
జీవితంలో ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరమని, శిక్షణతోనే నైపుణ్యాలు మెరుగుపడతాయని విద్యార్థులకు హితబోధ చేశారు. సమాజంలో సామరస్యం ఉండాలంటే కొన్ని పద్ధతులు, వ్యవస్థ ఉండాలన్నారు. వాటిని మనం గౌరవించుకోవాలని చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications