వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాహనాలకు నిప్పు...విశాఖ జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన మావోలు
విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జీకే వీధి మండలంలో శనివారం ఉదయం మావోయిస్టులు ఓ జేసీబీని దగ్ధం చేశారు. దీంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం పరిధిలో స్థానికంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అందుకోసమే అక్కడ ఉన్న జేసీబీని తగులబెట్టారు. ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు.
పలుసార్లు ఈ విషయమై హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా యథావిథిగా రోడ్డు నిర్మాణం కొనసాగుతుండటం, పైగా భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుపుతుండటాన్ని మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల వద్ద సిబ్బంది లేని సమయం చూసి మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడ్డారు.
Comments
English summary
Local road works are underway at the JK veedhi mandal in Visakhapatnam district. The Maoists tried to stop that works. For that alerts were also issued on this issue. However, the Maoists have observed that road construction work is going on under the supervision of security forces. Thats why Maoists set fire to JCB.
Story first published: Saturday, December 23, 2017, 12:39 [IST]