Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాహనాలకు నిప్పు...విశాఖ జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన మావోలు

విశాఖ​ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జీకే వీధి మండలంలో శనివారం ఉదయం మావోయిస్టులు ఓ జేసీబీని దగ్ధం చేశారు. దీంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.

విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం పరిధిలో స్థానికంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అందుకోసమే అక్కడ ఉన్న జేసీబీని తగులబెట్టారు. ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు.

Maoists torch vehicle in visakha district

పలుసార్లు ఈ విషయమై హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా యథావిథిగా రోడ్డు నిర్మాణం కొనసాగుతుండటం, పైగా భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుపుతుండటాన్ని మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల వద్ద సిబ్బంది లేని సమయం చూసి మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+