పెద్ద నగదు నోట్ల రద్దుతో నన్నపునేని కుటుంబంలో పెళ్ళి వాయిదా
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఎపి మహిళ కమీషన్ చెర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరిది కుమార్తె వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం చేయాలని భావించారు. అయితే పెద్ద నగ
గుంటూరు :పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం అందరికీ కష్టాలను తెచ్చిపెడుతోంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడ ఈ ఇబ్బందులు తప్పలేదు. ఆంద్రప్రదేశ్ మహిళ కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇంట్లో పెళ్ళిని వాయిదా వేసుకొన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నారు.
ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్నపనేని రాజకుమారి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మహిళ చైర్ పర్సన్ గా భాద్యతలు స్వీకరించారు. ఆమె మరిది కుమార్తె వివాహాన్ని డిసెంబర్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వివాహం చేయాలని 20 రోజుల క్రితం తీసుకొన్నారు. ఈ నిర్ణయం తీసుకొన్న సమయానికి పెద్ద నగదు నోట్లు రద్దు కాలేదు.
వివాహానికి ముందుగానే నిశ్చితార్థం కోసం పెద్ద ఫంక్షన్ హల్ ను బుక్ చేసే పనిలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది.. ఈ నిర్ణయంతో నిశ్చితార్థంపై తీవ్రంగా పడింది. ఫంక్షన్ హాల్ లో కాకుండా నిశ్చితార్థాన్ని తెనాలిలోని సాయిబాబా గుడికి మార్చారు.
నిశ్చితార్థ వేడుకను కూడ సాదాసీదాగానే జరిపారు. రెండు వైపులా కుటుంబసభ్యులను మాత్రమే పిలిచారు. డిసెంబర్ లో నిర్వహించాల్సిన వివాహ వేడుకలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరపాలని తలపెట్టారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఈ పరిస్థితుల్లో వివాహం జరపడం వల్ల ఇబ్బంది నెలకొంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు.
పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం అందరికీ కష్టాలను తెచ్చిపెడుతోంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడ ఈ ఇబ్బందులు తప్పలేదు. ఆంద్రప్రదేశ్ మహిళ కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇంట్లో పెళ్ళిని వాయిదా వేసుకొన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నారు.