వివాహితపై అత్యాచారం: పిండ ప్రదానం చేయబోయి...
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కీచకపర్వం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివాహితపై వరుసకు బంధువైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దంపతుల మృతి
నల్లగొండ జిల్లా వేములపల్లిలోని సాగర్ కాల్వలో పడి దంపతులు మరణించారు. పిండప్రదానం చేసేందుకు వచ్చిన దంపతులు సాగర్ ఎడమకాల్వలో గల్లంతయ్యారు. కాల్వలో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. భర్త మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లారీ బోల్తా ముగ్గురి మృతి
ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కరెంట్ షాక్తో రైతు మృతి
అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్తు తీగలు తగిలి ఓ రైతు మరణించాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రుయ్యూరులో సోమవారం చోటు చేసుకుంది. కావూరి రాజయ్య అనే రైతు సోమవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంపును ఆన్ చేయడానికి బావి వద్దకు వెళ్లాడు. అయితే, అంతకు ముందు రోజు రాత్రి అడవి పందులను నియంత్రించడానికి విద్యుత్తు తీగల విషయం తెలియలేదు. ఆ విద్యుత్తు తీగెలు తగిలి రైతు మరణించాడు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications