గ్రౌండ్ ఖాళీ చేయాల్సిందే: సునిత, కిరణ్కి ఏరాసు అండ
హైదరాబాద్/మెదక్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. మంత్రి సునితా లక్ష్మా రెడ్డి మెదక్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. ఉద్యమం మొదలైనప్పుడు ఆట ప్రారంభమైందని, సిడబ్ల్యూసి నిర్ణయంతో ముగిసిందన్నారు. ఇప్పుడు గ్రౌండ్ ఖాళీ చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, సీమాంధ్రులు సహకరించాలని ఆమె కోరారు.
ముఖ్యమంత్రికి బ్రహ్మానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి శంకర రావు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తప్పులేదన్న ఏరాసు
ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వేరుగా అన్నారు. రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మరో మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు పది లక్షల మందితో వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామన్నారు.

శంకించొద్దు: కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు అనంత వెంకట్రామి రెడ్డి, సాయిప్రతాప్, హర్షకుమార్లు పాల్గొన్నారు. సమైక్యాంధ్రపై ఎంపీల చిత్తశుద్ధిని అనుమానించవద్దని, ఉద్యోగులకు ఎంత కమిట్మెంట్ ఉందో తమకు అంతే ఉందని హర్ష కుమార్ చెప్పారు.
విభజనతో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం పైన తాము కేంద్రానికి చెప్పామని, బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరామని, పెట్టుబడులు అన్నీ హైదరాబాదుకే వెళ్లాయని, ఉద్యోగాలు కావాలంటే సీమాంధ్రులకు హైదరాబాదే గతి అని తాము వివరించామని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. విభజన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించాలని కోరినట్లు చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications