మేయర్ హత్య, చింటూ లొంగుబాటు: ప్రాణభయమా, పోలీసుల 'ఆర్థిక' వ్యూహమా?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. కారులో వచ్చిన చింటూ తనంతట తానుగా చిత్తూరు కోర్టుకు వచ్చాడు. పదమూడు రోజుల క్రితం మేయర్ దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
తాను లొంగిపోతానని చింటూ రెండు మూడు రోజుల క్రితం మీడియాకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ రోజు న్యాయస్థానంలో లొంగిపోవడం గమనార్హం. మేయర్ దంపతుల హత్య అనంతరం చింటూ పారిపోయాడు. హత్యలో పాల్గొన్న వారిలో ముగ్గురు ఆ రోజే లొంగిపోయారు.

వ్యూహాత్మకంగా లొంగిపోయాడా?
రెండు రోజుల క్రితం చింటూ.. మీడియాకు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాను లొంగిపోతానని ఆయన ప్రకటించాడు. 17వ తేదీన చింటూ తన మేనమామ, అత్తయ్య (మేయర్ అనురాధ, మోహన్)లను హత్య చేసిన అనంతరం అతను పారిపోయాడు. చింటూ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు.
పోలీసులు పది బృందాలుగా ఏర్పడి వెతికినా అతను దొరకలేదు. అయితే, అతను లొంగిపోతానని లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు లొంగిపోయాడు. అతను వ్యూహాత్మకంగానే లొంగిపోయాడా? అనే చర్చ సాగుతోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
దీంతో అతను ప్రాణభయంతోనే లొంగిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చింటూ లొంగిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫలించిన పోలీసుల వ్యూహం
అదే విధంగా చింటూ లొంగుబాటులో పోలీసుల వ్యూహం కూడా ఫలించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మేయర్ దంపతుల హత్య అనంతరం చింటూ పారిపోయాడు.
అతను విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో పోలీసులు అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతని బ్యాంకు లావాదేవీలు సీజ్ చేశారు. కదలికల పైన కన్నేశారు. అతనికి ఎవరి నుంచి ఆర్థిక సాయం అందకుండా పోలీసులు వ్యవహరించారు. ఆర్థిక కారణాలతో పాటు ప్రాణహానీ కారణంగా అతను లొంగిపోయి ఉంటారని భావిస్తున్నారు.
కోర్టులో లొంగి పోయిన చింటూకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతనిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. న్యాయమూర్తి చింటూకు 14 రోజుల రిమాండ్ విధించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications