త్వరలో స్పెయిన్కు మంత్రి భూమా అఖిలప్రియ, 15 నుంచి 22 వరకు
కర్నూలు: తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి భూమా అఖిలప్రియ ఈ నెల 15 నుంచి 22 వరకు అధికారిక పర్యటన నిమిత్తం స్పెయిన్కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అనుమతించినట్లు సాధారణ పరిపాలనా విభాగం రాజకీయ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఆళ్లగడ్డలో రూ.50 లక్షలతో బస్టాండు విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణాలకు అఖిల ప్రియ గురువారం శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్కు చెందిన నిధులతో త్వరలోనే సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు.

సీసీ రోడ్డు పూర్తయితే బస్టాండులోని సమస్యలు ఎన్నో పరిష్కారం అవుతాయని చెప్పారు. త్వరలోనే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఆడిటోరియం ఏర్పాటు చేసతామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications