వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"జగన్‌లో ఆ భయం.. ప్రపంచానికి ఐసిస్‌‌లా ఏపీకి ఆయన ప్రమాదకరం"

ప్రపంచానికి ఐసిస్‌, ఏపీకి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీ అధినేతపై సంధిస్తున్నారు. కుల, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించగా.. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా అవే వ్యాఖ్యలు చేశారు.

నంద్యాలలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కొల్లు ఆరోపించారు. నంద్యాలలో ఓడిపోతామన్న భయం జగన్‌లో కనబడుతోందన్నారు. ఐసిస్‌ ప్రపంచానికి ప్రమాదకరమైతే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

minister kollu ravindra takes on ys jagan

వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా నంద్యాల ప్రజలు స్వేచ్చగా ఓటేయాలని కొల్లు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ప్రజలు టీడీపీకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని, ఓటమి భయంతోనే జగన్ ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

English summary
AP Minister Kollu Ravindra alleged that YSRCP President Jagan was trying cancel the Nandyala by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X