సీఎం జగన్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ల స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ను అన్న అంటూ కేటీఆర్ ఎప్పుడు గౌరవిస్తునే ఉంటారు. ఆ మధ్య తెలంగాణ దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని కోరగానే సీఎం జగన్ దానికి తగిన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆరే స్వయంగా మీడియాకు తెలిపారు.
తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ సీఎం జగన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంత్రి కేటీఆర్ ప్రస్తుతం వరంగల్ పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా క్యాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఇక మీదట ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఎక్కడిక్కడక్కడే పరిశ్రమలను పెట్టాలన్నారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఐటీ ఉద్యోగులుగా పని చేస్తున్నారని.. వారంతా తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఏపీలో భీమవరం, నెల్లూరు , విశాఖ ప్రాంతాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. అక్కడ గొప్పగా ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, అవసరమైతే జగనన్నకు చెప్పి అక్కడ స్థలం ఇప్పించే బాధ్యత తనదని..క్యాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏపీలో కూడా స్థాపించాలని కంపెనీ యాజమానులకు కేటీఆర్ సూచించారు.

కేటీఆర్ నుంచి జగన్ పేరుగా రాగానే .. సభలో ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేశారు. ఈ సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అందరూ బాగుంటేనే దేశం బాగుటుందన్నారు. దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే ఎక్కడివారికి అక్కడే ఉపాధి దొరకాలన్నారు. దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications