ఆలయంలో జగన్ పూజలు, మంత్రి పల్లె కౌంటర్
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో సోమవారం నాడు కొనసాగుతోంది. ఆయన ఉదయం కొత్త చెరువు మండలం ఇండ్ల వెంకటాపురంలోని చెన్నకేశ్వ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జగన్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు జగన్కు తీర్థప్రసాదాలు అందించారు.
అనంతరం జగన్ మరుకుంటపల్లి చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కేశప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంకు నోటీసులు, లోన్ బిల్లులను జగన్ పరిశీలించారు. కేశప్ప కుటుంబ సభ్యులను పొలం, అప్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మొసలి కన్నీరు: మంత్రి పల్లె
జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వేరుగా వ్యాఖ్యానించారు. జగన్ రైతు భరోసా పర్యటన పైన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ విమర్శలపై స్పందించారు. ఎదురుదాడి చేశారు.
రుణమాఫీనే సాధ్యం కాదన్న జగన్ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని రుణమాఫీపై మాట్లాడుతున్నారన్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని చెరువులను త్వరలోనే నీటితో నింపుతామన్నారు. అనంతపై చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని పల్లె చెప్పారు.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేసేందుకు వస్తున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆలయంలో జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న పురోహితులు.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆలయంలో నమస్కరిస్తున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆలయంలో తీర్థం తీసుకుంటున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. వృద్ధులతో మాట్లాడుతున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. వృద్ధులతో మాట్లాడుతున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఓ కుటుంబాన్ని ఓదార్చుతున్న జగన్.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఓ చిన్నారిని ఎత్తుకున్న జగన్.