గ్యాంగ్స్టర్ మధుసూదన్ రెడ్డితో సంబంధాలు!: మంత్రి పల్లె, 'ఆత్మరక్షణలో టిడిపి'
అనంతపురం: బెంగళూరులో దాడికి గురైన గ్యాంగ్ స్టర్ మధుసూదన్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పల్లె గురువారం విలేకరులతో మాట్లాడారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి తన గెలుపు కోసం పని చేశాడని చెప్పారు. అయితే బెంగళూరులో మధుకు ల్యాండ్ సెటిల్మెంట్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి పల్లె బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధును కలుస్తాడని అంటున్నారు. సెటిల్మెంట్ల వ్యవహారంలో మధు దొరకడంతో టిడిపి ఆత్మరక్షణలో పడిందని సాక్షి మీడియా రాసింది. ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో మధు భారీగా సెటిల్మెంట్లు నిర్వహించినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడు మధుసూదన్ రెడ్డిపై దాడి జరిగింది. భూదందాల విషయంలో హెబెట్టు మంజు అనుచరులను మధుసూదన్ రెడ్డి బెదిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో భూదందాలు నిర్వహిస్తూ హెబెట్టు మంజు అనుచరుల వ్యవహారాల్లో మధుసూదన్ రెడ్డి తలదూర్చారని అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications