చిత్తూరు జిల్లా బంద్- చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు
రాయచోటి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా.. ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది.
నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలతో రెండు పార్టీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి.
పరిస్థితి చేయి దాటిపోతోండటంతో పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ- వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. పారా మిలటరీ బలగాలపైనా రాళ్లు విసిరారు. ఈ పరిణామాలతో పుంగనూరు రణరంగంగా మారింది.
దీనిపై పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ అల్లర్లకు చంద్రబాబే ప్రధాన కారకుడని ఆరోపించారు. అధికారంలోకి రాలేమనే విషయం తెలిసి..ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. పుంగనూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తోన్నాడని మండిపడ్డారు.

ఇలాంటి చర్యలతో తనను ఓడించాలనుకుంటే అది చంద్రబాబు భ్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. పుంగనూరుకు 200 మంది బయటి వ్యక్తులు, టీడీపీకి చెందని వారిని చంద్రబాబు తరలించాడని విమర్శించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు- ఓటమి భయంతో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోన్నాడని అన్నారు.
చంద్రబాబు మానసిక పరిస్థితి బాగో లేకపోవడమో.. లేక ఓటమి తప్పదనే నిరాశ, నిస్పృహతోనో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఓ మంచి డాక్టర్ను సంప్రదించి.. మానసిక రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఏపీ రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు అనేవి చంద్రబాబుతోనే పుట్టాయని ధ్వజమెత్తారు.
కాగా- పుంగనూరు ఉదంతంపై అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. టీడీపీ దాడులకు నిరసనగా జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు జిల్లాలో బంద్ పాటిస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications