భయపడి కాదు, కిరణ్ వస్తే 200కోట్లు వచ్చేవి: జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలకు భయపడి రచ్చబండను వాయిదా వేయలేదని, అదిలాబాదులో కృతజ్ఞత సభ ఉన్నందున జిల్లా మంత్రులు కోరడంతో వాయిదా పడిందన్నారు. త్వరలో సంగారెడ్డిలో లక్ష మందితో సభ పెడతానని, దానికి ముఖ్యమంత్రి వస్తారన్నారు.
రాష్ట్రం విడిపోదు: కొండ్రు
రాష్ట్రం విడిపోదేనే తాను భావిస్తున్నానని మంత్రి కొండ్రు మురళీ వేరుగా అన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు చెప్పారు.
పార్థసారథిని అడ్డుకున్న వైయస్సార్ కాంగ్రెసు
మంత్రి పార్థసారథిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకుంది. కృష్ణా జిల్లా కైకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్థసారథిని జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
హైదరాబాద్పై ఆంక్షలు పెడితే మద్దతివ్వం: దత్తాత్రేయ
హైదరాబాదు నగరం పైన ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కేంద్రపాలిత ప్రాంతం చేసినా తమ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మెదక్ జిల్లాలో అన్నారు.