బిజెపి నేత మురళీధర్రావుకు అస్వస్థత, స్విమ్స్లో చేరిక
చిత్తూరు: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అస్వస్థతకు గురయ్యారు. మురళీధర్రావును సోమవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో బిజెపి నేతలు చేర్పించారు. స్విమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మురళీధర్రావుకు చికిత్స కొనసాగుతోంది.

ఏపి బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మాలతిరాణి
ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాలతిరాణిని నియమించినట్లు ఏపి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. మొత్తం 55 మందితో మహిళా మోర్చా కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు.
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కేంద్రంలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లపు సాంబయ్య(55), అతని సోదరుడు పల్లపు ఎర్రయ్య(50)లు దుర్మరణం పాలయ్యారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications