అడ్డుకోబోయిన భర్తపై దాడి, గర్భిణిపై రేప్ యత్నం
కత్తులతో దాడి చేయడం వల్ల గాయపడిన మహిళ భర్త రామకృష్ణ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా ముంగనూరు నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన దంపతులకు ఈ దారుణమైన ఘటన ఎదురైంది. బహర్భూమికి వెళ్లేందుకు దంపతులు మూసీనది ఒడ్డుకు వచ్చారు. ఆ సమయంలో దుండగులు దాడికి దిగారు.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి తల్లి కూడా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం చింతలతండాలో ఈ విషాద సంఘటన జరిగింది.
మహిళ కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి తాను కూడా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలుగజేసింది.
Comments
English summary
Five miscreants in Hyderabad near Musi river attempted to rape a pregnant woman came from Mahaboobnagar district.
Story first published: Monday, March 17, 2014, 10:55 [IST]