లోకేష్! మీ నాన్నే గుర్తుపెట్టుకో, మా ఎంపీలు డిస్క్వాలిఫై కాకుండా కుమ్మక్కు: మిథున్ రెడ్డి కౌంటర్
అమరావతి: వైసీపీ ఎంపీలు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్న, వారికి అవార్డులు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన తాము రాజీనామా చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమతో కలిసి రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేదని చెప్పారు.
Recommended Video

కానీ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా, రాకపోయినా తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ రాజీనామాలను రేపు (బుధవారం) ఆమోదిస్తారని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నీతి, నిజాయితీల గురించి మాట్లాడే ముందు తమ గురించి ఆలోచించాలని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఓటుకు నోటు తర్వాత హైదరాబాద్ నుంచి పారిపోయారు
ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత కొందరు హైదరాబాద్ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా ఎంపీలు కనీసం ప్రమాణ స్వీకారం చేయకముందే మీ తండ్రి (చంద్రబాబు) వారిని కొనుగోలు చేశారని మిథున్ రెడ్డి మంత్రి నారా లోకేష్కు కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలను 23 మందిని మీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. ఎయిర్ ఏషియా స్కాంలో దొరికిన టేపుల్లో చంద్రబాబు పేరు ఉన్నట్లు సీబీఐ దర్యాఫ్తులో తేలిందన్నారు. మీ పద్ధతి ఇలా ఉంటే మీరు మాకు సుద్దులు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

మా ఎంపీలు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై కాకుండా బీజేపీతో కుమ్మక్కు
మా రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు సరేనని, టీడీపీలో చేరిన ఎంపీలు కనీసం డిస్క్వాలిఫై కాకుండా బీజేపీతో చంద్రబాబే కుమ్మక్కు అయ్యారని ధ్వజమెత్తారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో మీ నాన్న దగ్గర నిజాయితీగా తెలుసుకోవాలని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు పేరు రావడంతో సీబీఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. తాము రాజీనామాలు చేసి రెండు నెలలు అవుతుంటే నిన్న మొన్నా చేసినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ రాజీనామాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

అవిశ్వాసంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం, మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీని కోరితే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతో ఏపీకి మేలు జరుగుతుందని చెప్పినా వినలేదన్నారు. హోదా కోసం టీడీపీతో కలిసి పని చేస్తామని కూడా చెప్పామన్నారు. రాజీనామాలు చేయమని నిలదీస్తే పారిపోయింది టీడీపీనే అన్నారు. 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేదన్నారు.

లోకేష్! ఈ విషయం గుర్తు పెట్టుకో
నాలుగేళ్లలో చంద్రబాబు ఏపీకి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని మిథున్ రెడ్డి నిలదీశారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ లోకేష్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది మీ నాన్న చంద్రబాబే అన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని లోకేష్ మాట్లాడాలన్నారు. నూటికి నూరుపాళ్లు మా రాజీనామాలు ఆమోదం పొందుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications