నిజమెంత?: క్రికెట్ బెట్టింగ్ కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు?
నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారిచ్చిన సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలిసింది.
30మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేసి, వారిని పోలీసులు విచారిస్తుండగా పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. బెట్టింగ్ వెనుక పలువురు ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారని అరెస్టైన నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అయితే, అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నప్పటికీ తమ పార్టీ ప్రజాప్రతినిధులను మాత్రమే ఇరికించే కుట్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బుకీల నుంచి పోలీసులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఆరోపించారు.
కానిస్టేబుల్ నుంచి సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకూ ఇందులో భాగముందని వారు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలను వదిలేసే ప్రయత్నం జరుగుతోందని వారు మండిపడ్డారు. కాగా, పోలీసుల విచారణలో బయటకు వెల్లడైన పేర్ల గురించి స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications