వైసిపి నేతకు రూ.3 కోట్ల పనుల చిక్కు: కడప టిడిపిలో లుకలుకలు
కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు సవాళ్ల వరకు వెళ్తున్నాయి. వైసిపి నేత బంధువుకు ఎమ్మెల్యే జయరాములు రూ.3 కోట్లు పనులు ఇచ్చారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపించాయి.
కడప: కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు సవాళ్ల వరకు వెళ్తున్నాయి. వైసిపి నేత, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బంధువుకు ఎమ్మెల్యే జయరాములు రూ.3 కోట్లు పనులు ఇచ్చారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపించాయి.
దీనిపై జయరాములు స్పందించారు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బంధువుకు తాను పనులు ఇచ్చానని నిరూపిస్తే టిడిపికి రాజీనామా చేస్తానని, రుజువు చేయకుంటే తనప ఆరోపణలు చేసిన వారు రాజకీయాలను వదులు కుంటారా అని సవాల్ విసిరారు.
చదవండి: వైసిపిలోకి టిడిపి నేత: కడప పర్యటనను వాయదా వేసుకున్న జగన్
మాజీ ఎమ్మెల్యే విజయమ్మతోపాటు ఏడు మండలాలకు చెందిన టిడిపి నాయకుల తీరును ఆయన తప్పుపట్టారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలే తప్ప తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చవద్దన్నారు.

నియోజకవర్గానికి ఓ పథకం కింద రూ. 70 కోట్లు పనులు వచ్చాయని, తన వర్గీయులకు ఒకపని కూడా ఇవ్వకుండా తనకు నచ్చిన వాళ్లకు విజయమ్మ కేటాయించారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ నవ నిర్మాణ, మహా సంకల్ప దీక్షల్లో పాల్గొనకుండా.. తనపై టిడిపి నాయకులను రెచ్చగొట్టి పత్రిలకెక్కడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారంతా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నవారేనన్నారు.
కాగా, జయరాములు కూడా 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసిపి నుంచి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టిడిపిలోకి వచ్చిన చోట ఆ పార్టీలో లుకలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications