టెక్కీ హత్య: సోదరికి ఎమ్మెమ్మెస్ పంపించాడు, విడాకులే
చంద్రశేఖర్ను హత్య చేసిన కిరాయి హంతకులు రుజువుగా ఓ క్లిప్ వీడియో తీసి పంపించారు. దీంతో పోలీసులు కేసును సులభంగా ఛేదించారు.
చంద్రశేఖర్ బికె గూడలో ఉంటూ ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను గత బుధవారం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ బావమరిది, మరికొందరు కలిసి అతనిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం విచారణలో వీడియో ఎమ్మెమ్మెస్ క్లిప్ ద్వారా వారిని నిందితులుగా గుర్తించారు.
చంద్రశేఖర్ నాలుగేళ్ల క్రితం సంధ్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. నిత్యం గొడవల కారణంగా ఇరువురు విడిపోయారు. చంద్రశేఖర్ ఆ తర్వాత లావణ్య అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
ట్విస్ట్
చంద్రశేఖర్ను హత్య చేసిన అనంతరం హంతకులు రుజువుగా ఇందుకు సంబంధించి వీడియోను తీసి అతని బావమరిదికి ఎమ్మెమ్మెస్ క్లిప్ను పంపించారు. అతను ఆ క్లిప్ను తన సోదరి సంధ్యకు పంపించాడు. చంద్రశేఖర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం హత్యకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ తల్లి గురువారం రోజు పోలీసులను ఆశ్రయించారు.