ఏపి, టిల్లో ఐఏఎస్,ఐపిఎస్ పంపకాలకు మోడీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాల ఫైలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేశారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాలు జరుగుతున్నాయని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సీనియారిటీ ప్రాతిపదికన రొటేషన్ పద్ధతిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాల ఫైలుపై ప్రధాని సంతకం చేయడంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫైలుపై మంగళవారం సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాంచల్ విడిపోయిన సందర్భంలోనూ ఇదే విధంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాలు సజావుగా జరగనున్నాయి.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications