విభేదాలు: అన్నంలో విషం కలిపి కుమార్తెలకు తినిపించిన తల్లి, ఒకరు మృతి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం కోరుమామిడిలో భార్యభర్తల మధ్య విభేదాలు కుటుంబంలో ఒకరు చనిపోయేలా చేశాయి. ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో విషం కలిపి తినిపించి, ఆ తర్వాత ఆమె కూడా తీసుకుంది.
ఈ ఘటనలో ఒక కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె, తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్ధానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నాం ముంగర రామకృష్ణ, అతని భార్య గౌరమ్మ తగాదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భర్త పనిమీద బయటకు వెళ్లగా, ఇద్దరు కుమార్తెలకు విషం కలిపిన అన్నం తినిపించిన గౌరమ్మ ఆ తర్వాత తన కూడా తింది.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన రామకృష్ణ భార్య పిల్లల్నిహుటాహుటిన నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రికి వెళ్లేలోపే పెద్ద కుమార్తె సోని మృతి చెందగా, చిన్న కూతురు రాధిక, భార్య గౌరమ్మ చికిత్సను పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.