వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డు: ప్రియుడి మోజులో ఆరేళ్ల కొడుకును చంపిన తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పెనుగొండ మండలం వడలిలో ఓ తల్లి ప్రియుడితో కలిసి తన ఆరేళ్ల సొంత కొడుకునే హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, కొబ్బరి తాడు మెడకు బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Mother kills six year old boy

భూమిలోనుంచి 5 అడుగులు పైకిలేచి నీటిసంపు

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో బుధవారం ఓ వింత చోటు చేసుకుంది. భూమిలో నిర్మించిన నీటి సంపు ఉన్నట్టుండి ఐదు అడుగుల పైకి లేచింది.

గ్రామ సమీపంలోని అభినవ హైటెక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ఏడాది క్రితం భూమిలో నీటికోసం సంపు నిర్మించారు. సుమారు 5 వేల లీటర్లు సామర్థ్యం ఉన్న ఈ సంపు ఉన్నట్టుండి భూమిలోనుంచి 5 అడుగులు పైకి లేచింది. ఈ సంపు గండిపేట చెరువు సమీపంలో ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ఒత్తిడి పెరిగి పైకి లేచి ఉండవచ్చునని భావిస్తున్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల యత్నం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముట్టుడికి యత్నించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్ట్‌ చేశారు.

English summary

 Mother kills six year old boy in West Godvari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X