ప్రోటోకాల్ వివాదం: కులం పేరుతో దూషించారంటూ ఎంపీ ఫిర్యాదు
విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ వివాదం, కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాయపల్లిలో సెల్ టవర్ల ప్రారంభోత్సవంలో ఎంపీ కొత్త పల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది.
ఎంపీ గీత రాకముందే ఎమ్మెల్యే రాజేశ్వరి సెల్ టవర్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రంపచోడవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంత ఉదయభాస్కర్తో పాటు మరో ముగ్గురిపై ఎంపీ గీత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తనన్ని కులం పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దూషించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైయస్ఆర్సీపీ నేత ఉదయ్ భాస్కర్, మరో ముగ్గురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎంపీ గీత ఫిర్యాదు చేసిన వెంటనే, ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్డతీగలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగబాబుతో సహా నలుగురు తనని కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే రాజేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications