మోడీ అంటే ఎంత భయం! ఢిల్లీ వెళ్లి చతికిలపడ్డారు: చంద్రబాబుపై వరప్రసాద్ సెటైర్లు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్న కులాలంటే చులకన భావమని, అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలని అన్నారు.
బుధవారం ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ. ఏ ఒక్కరు దళితుడిగా పుట్టాలని కోరుకోరని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారులను మీ అంతుచూస్తానని అన్న చంద్రబాబు.. తాజాగా కనీస వేతనాలివ్వలన్న నాయీ బ్రాహ్మణులపై ఆగ్రహంతో ఊగిపోయారని మండిపడ్డారు. అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా? అని వరప్రసాద్ ప్రశ్నించారు.

బీజేపీపై యుద్ధం ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లి చతికిల పడ్డారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మోడీ అంటే బాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుందని అన్నారు. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తే అయితే చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారని అన్నారు.
ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ, దళితుల విలువ గురించి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో తెలుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications