ఇండియా కూటమిలోకి తెలుగుదేశం..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ, జనసేన పొత్తు అధికారికమైంది. చంద్రబాబును కుట్ర పూరితంగా జైలులో పెట్టారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ తాను చంద్రబాబుకు అండగా ఉంటానని ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆకాంక్షించారు. ఇదే సమయంలో టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందని వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
మారుతున్న సమీకరణాలు : చంద్రబాబు అరెస్ట్ అయి నేటితో వారం పూర్తయింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటీషన్లను కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో రాజకీయంగా చంద్రబాబు అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు స్కిల్ స్కాంలో అవినీతి చేసారని ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు..విచారణ అధికారులు వివరిస్తున్నారు. కౌంటర్ గా టీడీపీ సైతం అసలు ఈ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ కేంద్రంగా ఇదే వాదన వినిపిస్తున్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎవరూ స్పందించలేదు.
సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు : ఈ సమయంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాయిరెడ్డి చేసిన ట్వీట్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న నేతలు లోకేశ్ కు ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది ఇండియా కూటమిలోకి టీడీపీ భాగస్వామి అనేది స్పష్టం చేస్తుందన్నారు.
వీరందరి వ్యూహం ఒక్కటేనని దోచుకోవమే లక్ష్యమని సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు టీడీపీకి సత్తా లేదని సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన తరువాత పవన్ పొత్తు ప్రకటన వేళ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు.
Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023
బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ : 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి పొత్తు పైన స్పష్టత రాలేదు. ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తనంతట తాను టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
ఈ ససమయంలో చంద్రబాబు కు మద్దతుగా ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి స్పందన లేదు. దీంతో, ఇక ఇండియా కూటమితోనే టీడీపీ కొనసాగుతుందంటూ తాజాగా విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications