ముద్రగడకు క్యాన్సర్ - చికిత్స, కుమార్తె ఆందోళన..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం పై ఆయన కుమార్తె కీలక అంశాలను బయట పెట్టారు. కొంత కాలంగా ముద్రగడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేసారు. తన తండ్రికి తన సోదరుడు సరైన చికిత్స చేయించటం లేదని ఆరోపించారు. ముద్రగడతో రాజకీయంగా విభేదించిన క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. తాజాగా ముద్రగడ ఆరోగ్యం గురించి చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేసారు. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని సోషల్ మీడియాలో పోస్టింగ్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి తెలిసి కలిసేందు కు వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేను గిరి , అతని మామ నా తండ్రిని కలవడానికి అనుమతించలే దని ట్వీట్లో వివరించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి పేర్కొన్నారు.

తన సోదరుడు గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని పేర్కొన్నారు. బయట నుంచి ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది దారుణమని.. ఎంత మాత్రం సహించే విషయం కాదని క్రాంతి స్పష్టం చేశారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే వదిలిపెట్టననని సోదరుడు గిరికి క్రాంతి హెచ్చరించారు. కొంత కాలంగా రాజకీయంగా ముద్రగడతో కుమార్తె క్రాంతి విభేదించారు. అప్పట్లో ముద్రగడ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముద్రగడ వ్యవహా రాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు. కాగా, ముద్రగడ ఆరోగ్యం పైన కుమార్తె చేసిన పోస్టింగ్ సంచలనంగా మారుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications