శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్ష్యం లేక ఏడుగురి హత్య కేసులో మరణశిక్ష రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఏడుగురిని హత్య చేసిన కేసులో సిర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ శంకరరావు విముక్తి పొందాడు. తన ఇద్దరు పిల్లల హత్యకేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఐదుగురిని అతను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని విశాఖపట్నంలోని ఓ ఆశ్రమంలో ఉంచాలని హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది.

కీలకమైన సాక్ష్యుల సాక్ష్యాలను నమోదు చేయకపోవడం కేసును బలహీనపరిచిందని, అత్యంత కిరాతకమైన నేరాల విషయంలో కూడా చాలాసార్లు ఇలా జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిందిడుతు శంకర్రావుకు శ్రీకాకుళం జిల్లా సెషన్స్ కోర్టు 2012లో మరణశిక్ష విధించింది. అతను దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు.

 Murder accused let off for lack of evidence

ఈ కేసు ప్రాసిక్యూషన్ విచారణలో పలు మిస్సింగ్ లింకులున్నాయని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మారమూల గ్రామం మెట్టపేటకు చెందిన శంకరరావు 2010 నవంబర్ 30వ తేదీనతన ఇద్దరు పిల్లలను చంపాడని, ఆ తర్వాత పైలా వెంకటి, బొడ్డేపల్లి దమయంతి, వూట పార్వతి, పైలా లక్ష్మణ్, మెట్ట ఎర్రయ్యలను నరికి చంపినట్లు ఆరోపణలు చ్చాయి.

అంతకు ముందు భార్య హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు శంకరరావు ఆ ఐదుగురిని చంపినట్లు అభియోగాలు మోపారు. గ్రామంలో భయాందోళనలు సృష్టించడానికి బాంబులు కూడా విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి.

English summary
AP high court on Wednesday acquitted a Central Reserve Police Force (CRPF) constable who was awarded death sentence for killing seven persons, including his two minor children, by the Srikakulam district sessions court in 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X