ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్: చక్రం తిప్పిన బైరెడ్డి, ఏం జరిగిందంటే?
కర్నూల్: కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పావులు కదిపారు. బైరెడ్డి వ్యూహం ఫలించింది టిడిపిలో బైరెడ్డి చేరికకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో తన అనుచరుడితో నామినేషన్ వేయించడం ద్వారా బైరెడ్డి వేసిన ప్లాన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది.
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొంటున్నాయి. 2013 వరకు టిడిపిలోనే కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీ అభ్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
బైరెడ్డి టిడిపిలో చేరాలని తీసుకొన్న నిర్ణయాన్ని కర్నూల్ జిల్లాలోని కొందరు టిడిపి నాయకులు వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బైరెడ్డి తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారు.

తెరవెనుక చక్రం తిప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అయితే ఆ సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు నాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే దాని వెనుక టిడిపి నేతలు వ్యూహత్మకంగా అడుగులు వేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు నాగిరెడ్డి నామినేష్ ఉపసంహరణ చేసుకొనేలా బైరెడ్డిని ఒప్పించారు. ఈ సమయంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన డిమాండ్లను టిడిపి నేతల ముందుంచారు.దీంతో బైరెడ్డి టిడిపిలో చేరేందుకు మార్గం సుగమమైంది.

చంద్రబాబుతో బైరెడ్డి సమావేశం వెనుక కెఈ కృష్ణమూర్తి
చంద్రబాబునాయుడుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల సమావేశమయ్యారు.ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారని సమాచారం. కెఈ కృష్ణమూర్తి సోదరుడు కెఈ ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయాన్ని చంద్రబాబుతో చర్చించి ఆయనతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేయించడంలో కెఈ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కర్నూల్ జిల్లా టిడిపి వర్గాల్లో సాగుతోంది.

సంక్రాంతి తర్వాత టిడిపిలోకి బైరెడ్డి
సంక్రాంతి తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోకి చేరనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కలిసిన తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మంచి రోజులు లేనందున సంక్రాంతి తర్వాత బైరెడ్డి టిడిపిలో చేరనున్నారు.

విభేధాలు మరిచి
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకొన్న వారే ఆయన టిడిపిలో చేరేందుకు సమ్మతించాల్సిన పరిస్థితులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని వారు గుర్తు చేస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications