నంద్యాలపై వీడని సస్పెన్స్: బాబుతో భేటీ, మెట్టు దిగని అఖిల, పట్టు వీడని శిల్పా
నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ ముఖ్యనేతలు ఈ రోజు జరిపిన చర్చలు ముగిశాయి. దీనిపై భూమా, శిల్పా వర్గాలు సీఎం చంద్రబాబు వద్దకు బయలుదేరాయి.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ టికెట్పై తెలుగుదేశం పార్టీలో సస్పెన్స్ వీడలేదు. అఖిలప్రియ, శిల్పాలతో చంద్రబాబు శనివారం సాయంత్రం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. సీనియర్ నేతలతో భేటీ తర్వాత ఇరు వర్గాలవారు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తానని చంద్రబాబు వారితో చెప్పినట్లు సమాచారం. అంతవరకు కలిసి పనిచేయాలని ఇరు వర్గాలవారికి చెప్పారు. అయితే, అసెంబ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మాత్రమే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఏర్పడ్డ వివాదాన్ని తెరదించేందుకు మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ ఈ రోజు మంత్రి అఖిలప్రియతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ భేటీలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్ లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు.

ఈ అంశంలో తుది నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకే వారు వదిలేశారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈ రోజు జరిపిన భేటీ విశేషాలని చంద్రబాబుకి కళా వెంకట్రావు వివరించారు.
పార్టీ మారను: శిల్పామోహన్రెడ్డి
నేతలతో చర్చల అనంతరం శిల్పా మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారే యోచనే లేదన్నారు. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు. ఈ విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications