బురద జల్లడం కాదు, దమ్ముంటే నిరూపించు: జగన్కు లోకేష్ సవాల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్కు ఎప్పుడూ ఇతరులపై బురదజల్లి పారి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్కు ఎప్పుడూ ఇతరులపై బురదజల్లి పారిపోవడం అలవాటుగా మారిందని విమర్శించారు.
అసెంబ్లీలో విలువైన సమయాన్ని ఆయన వృథా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్కు దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు. సభాసమయాన్ని వృథా చేస్తున్న జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ పెద్ద స్కామని, ఇందులో పత్తిపాటి చీమ అని, ఎంపీలు, చంద్రబాబు కొడుకు హస్తం ఉందని చెబుతున్నారని గురువారం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్పై ఆదినారాయణ రెడ్డి సెటైర్లు
వైయస్
జగన్మోహన్రెడ్డిపై
శాసనసభ్యుడు
ఆదినారాయణరెడ్డి
చెణుకులు
విసిరారు.
జగన్ను
ఏదడిగినా
మూడేళ్లు
అంటాడని,
రేషన్,
పెన్షన్,..
ఇలా
దేని
గురించి
మాట్లాడినా
మూడేళ్లు
ఆగాలని
చెప్పేవాడని
గుర్తు
చేసుకున్నారు.
చివరికి
ఐసీయూలో
చికిత్స
పొందుతున్న
పేషెంట్కు
సాయం
చేయాలన్నా
మూడేళ్లు
ఆగాలంటాడని
సెటైర్
వేశారు.
ఆయనకు
డబ్బు
మీద
యావ,
పదవిపై
మోజు
తప్ప
మరేం
లేదని
అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పురోగతిలో వెళ్తుంటే జగన్ అధోగతిలో ఉన్నారని విమర్శించారు. వైయస్ కుటుంబం వందలాది హత్యలు చేయించిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాన్ని నడపడం చేతకాకపోవడం వల్లే తాము వైసీపీ నుంచి బయటకు వచ్చామని వివరించారు. అసెంబ్లీలో జగన్ ప్రవర్తనను ఖండిస్తూ చేసిన తీర్మానంపై ఆదినారాయణరెడ్డి సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.