ఆ ఫలితాలు నోళ్ళు మూయించాయి: లోకేష్
అమరావతి: నంద్యాల, కాకినాడలో విజయంతో విమర్శకుల నోర్లు మూయించామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చెప్పారు. టిడిపి వర్క్షాప్ సోమవారం నాడు మంగళగిరిలోని జరిగింది.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయంపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపక్షానికి దీటైన సమాధానం చెప్పామని లోకేష్ అభిప్రాయపడ్డారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నిండిందని ఆయన చెప్పారు. భవిష్యత్లోనూ కొనసాగిద్దామని టీడీపీ నేతలకు, పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.ప్రతి 15రోజులకోమారు శిక్షణా తరగతులను నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించినట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు నిరుత్సాహనికి గురయ్యాయి.అయితే ఇదే సమయంలో వైసీపీని మరింత దెబ్బతీసేందుకు టిడిపి వ్యూహ రచన చేస్తోంది.