ఆమరణ దీక్ష ఏడో రోజుకు చేరినా..: అసత్య ప్రచారమంటూ కేంద్రంపై లోకేష్ ఆగ్రహం
Recommended Video
అమరావతి: బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న లోకేష్.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకున్నా.. కేంద్రం ఇంత వరకు స్పందించకపోవడంపై ట్విట్టర్ వేదికగా లోకేష్ మండిపడ్డారు.
ఉక్కు పరిశ్రమ సాధన కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి వారి దీక్ష ఏడు రోజులకు చేరుకుంది. కాగా, దీక్ష చేస్తున్న వీరి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.