వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతా: నారా లోకేష్!!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో ఏ 14 నిందితుడిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును చేర్చిన విషయం తెలిసిందే .ఈ క్రమంలో నారా లోకేష్ స్పందించారు. త్వరలో తాను యువ గళం పాదయాత్ర ప్రారంభించబోతున్నానని, దానిని అడ్డుకోవడం కోసమే ఇలా అడ్డమైన కేసులలో తన పేరును పెడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు ఏ 14 గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో వైసిపి గిఫ్ట్ ఇస్తే, తాను వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇచ్చి తీరుతానని లోకేష్ చెప్పుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరు చేర్చారని పేర్కొన్న లోకేష్, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు తో తనకి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు.

అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, అలాంటప్పుడు అసలు కేసు ఏమిటో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేని చోట రెండేళ్ల పాటు విచారించి తనను నిందితుడిగా ఎలా చేరుస్తారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కు, తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన లోకేష్ కావాలని కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు సంబంధం లేదని, రోజుకో వదంతులతో, రోజుకో కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటానని పేర్కొన్న లోకేష్ ఇలాంటి కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నా పేరు కూడా చేర్చారు. తప్పకుండా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ #NaraLokesh #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/PO8TttWb0g
— Telugu Desam Party (@JaiTDP) September 26, 2023
టిడిపి హయాంలో తాను మంత్రిగా పని చేశానని, తాను పనిచేసిన శాఖలు వేరు, తనపై అభియోగాలు మోపిన శాఖలు వేరని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్న తరుణంలో అడ్డుకోవడం కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు రోడ్డు మీదకి రాకూడదన్న ఉద్దేశంతో కేసులు పెట్టి జైలుకు పంపాలని వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం తనకు గాని, తన తండ్రికి కానీ, తన కుటుంబ సభ్యులకు గానీ, తమ పార్టీ సభ్యులకు గానీ లేదని లోకేష్ పేర్కొన్నారు ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications