అక్కడే: రాజధానిపై ఎపి మంత్రి, సందేహమొద్దని దేవినేని
హైదరాబాద్: విజయవాడ - గుంటూరుల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనుకూలమని ఆ రాష్ట్ర మంత్రి నారాయణ బుధవారం అన్నారు. ప్రపంచం ప్రమాణాలకు అనుగుణంగా రాజధాని ఉంటుందని ఆయన చెప్పారు. పంట దిగుబడి పెంచేందుకు ప్రజలకు మెరుగైన విధానాలు చెబుతామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న మాటను నిరూపిస్తామని చెప్పారు.
సందేహాలు వద్దు: దేవినేని
రైతుల రుణమాఫీపై సందేహాలు అవసరం లేదని, కచ్చితంగా అమలుచేసి తీరతామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా స్పష్టం చేశారు. ఈ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారని వెల్లడించారు.

బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా వ్యవహరిస్తానన్నారు. రాష్ట్రానికి అవసరమైన వనరులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెడతానన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications