25 వేల ఎకరాల భూమి: ఎపి రాజధానిపై నారాయణ

ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు 20వ తేదీ లోపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజధాని సమదూరంలో ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ తెలిపారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సచివాలయం ఉండే ప్రాంతంలోనే హైకోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
కాగా, ఎంసెట్ కౌన్సెలింగ్పై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని చెప్పారు. వంద శాతం అక్షరాస్యత సాధించడం తమ లక్ష్యమని గంటా చెప్పారు.












Click it and Unblock the Notifications