రెండు రాష్ట్రాలు, భిన్నంగా వేడుకలు: టీలో ధూంధాం, ఏపీలో సంకల్పం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, తెరాస నేతలు పాల్గొన్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చంద్రబాబు నవ నిర్మాణ దీక్షకు సిద్ధమయ్యారు. ఇది తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ దీక్ష అని చెబుతున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద నవ నిర్మాణ దీక్ష ఉంటుంది.

తెలంగాణది సంబరం అయితే, ఏపీది సంకల్పం. మరోవైపు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి భవనంలో మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల ఆవిర్భావ కార్యక్రమాలు ఒకేసారి ఒకేచోట జరుగుతున్నాయి.
గురజాడ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఏపీ ఉద్యోగులు, ప్రజల చేత నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నారు. అదే సమయానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.
-
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications