నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే (ఫోటోలు)
అమరావతి: విశాఖపట్నంలోని తూర్పునౌకదళానికి చెందిన ఆయుధాగారంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. నౌకాదళానికి చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచే ఎన్ఏడీలో మంగళవారం మధ్యాహ్నం గడువు తీరిన పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.
అదే సమయంలో అక్కడున్న వి.వి. రమణ, పి. హరినాథరావు, వి. సత్యనారాయణ, ఎస్ఎస్. మురుములతో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. తొలుతు వారిని ఎన్ఏడీలోని డిస్పెన్సరీలో ప్రథమచికిత్స చేసి అనంతరం విశాఖలోని సెవెన్హిల్స్ ఆస్పత్రికి తరలించారు.
గాయపడ్డ వారిలో నలుగురు ఆస్పత్రిలో డిశ్చార్జి కాగా, రమణ అనే ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై తూర్పు నౌకాదళం విచారణకు ఆదేశించింది.
నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే
విశాఖపట్నంలోని తూర్పునౌకదళానికి చెందిన ఆయుధాగారంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే
ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. నౌకాదళానికి చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచే ఎన్ఏడీలో మంగళవారం మధ్యాహ్నం గడువు తీరిన పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.
నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే
అదే సమయంలో అక్కడున్న వి.వి. రమణ, పి. హరినాథరావు, వి. సత్యనారాయణ, ఎస్ఎస్. మురుములతో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.
నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే
తొలుతు వారిని ఎన్ఏడీలోని డిస్పెన్సరీలో ప్రథమచికిత్స చేసి అనంతరం విశాఖలోని సెవెన్హిల్స్ ఆస్పత్రికి తరలించారు.
నేవీ ఆయుధాగారంలో పేలుడు: గాయపడ్డ వారు వీరే
గాయపడ్డ వారిలో నలుగురు ఆస్పత్రిలో డిశ్చార్జి కాగా, రమణ అనే ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై తూర్పు నౌకాదళం విచారణకు ఆదేశించింది.