రేపు ఎన్డీయే కూటమి నేతగా చంద్రబాబు ఎంపిక - విజయవాడలో ఎమ్మెల్యేల భేటీ !
ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా రేపు విజయవాడలో కూటమిలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో చంద్రబాబును తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయబోతున్నారు.
ఎన్డీయే కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు రేపు విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. ఉదయం 9.30కు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇందులో అధికారికంగా చంద్రబాబును తమ నేతగా వారు ఎన్నుకుంటారు. తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ లేఖ సమర్పించనున్నారు.

అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. దీంతో ఎల్లుండి సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం కానుంది. ఎల్లుండి ఉదయం ముఖ్యమంత్రిగా గన్నవరం వద్ద గల కేసరపల్లిలో ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్నాక సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోబోతున్నారు. అనంతరం పాలనపై దృష్టిసారిస్తారు.
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications