ముందే రాజీనామా చేశా, అప్పటి వరకు: శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తాను తన పదవికి మూడు రోజుల ముందే రాజీనామా చేశానని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను మూడు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీకి పంపానని చెప్పారు.
హోంమంత్రిత్వ శాఖ నుంచి ఫోన్ వచ్చాక సభ్యులు రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు విధుల్లో ఉంటామని శశిధర్ రెడ్డి తెలిపారు.

యూపిఏ ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ పదవులను ఖాళీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆయా పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూపిఏ ప్రభుత్వ హయాంలో నియామకమైన గవర్నర్లు రాజీనామా చేయాలని హోంమంత్రిత్వ శాఖ కోరడంతో ఆయన రాజీనామా చేశారు. మిగితా రాష్ట్రాల గవర్నర్లు కూడా త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications