గుంజేపల్లి రామాలయంలోకి దళితులకు నో ఎంట్రీ.. అగ్రవర్ణాలతో ఘర్షణ; అనవసర రాద్ధాంతమన్న ఎమ్మెల్యే పద్మావతి
గుంజేపల్లిలో శ్రీరాములవారి ఆలయ ప్రవేశంపై దళితులు, అగ్రవర్ణాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం దళిత గ్రామస్తులను కొందరు అగ్రవర్ణాలకు చెందిన మహిళలు రామాలయంలోకి ప్రవేశం నిరాకరించడంతో వారు అగ్రవర్ణాల గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గుంజేపల్లి గ్రామంలోఉద్రిక్తత నెలకొంది. రెవిన్యూ శాఖ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

రామాలయంలోకి దళితులను అనుమతించని అగ్రవర్ణాల వారు.. వాగ్వాదం
కొంతకాలంగా ఆలయానికి రక్షణ కల్పించాలంటూ ఆలయ అర్చకుల అభ్యర్థన మేరకు అగ్రవర్ణాల వారు దళితులను ఆలయంలోకి అనుమతించవద్దని నిర్ణయించారు. దీంతో అగ్రవర్ణాల గ్రామస్తులు, దళితుల మధ్య ఘర్షణ మొదలైంది. సోమవారం దళితులను ఆలయంలోకి రాకుండా కొందరు మహిళలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిష్టంభన తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యు.వెంకట ప్రసాద్ మరియు కొంతమంది రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని సమస్య తీవ్రం కాకుండా అడ్డుకున్నారు.

దేవాలయాల్లోకి రాకుండా ఎవరినీ ఆపే హక్కు లేదన్న పోలీసులు
దేవాలయాల్లోకి ప్రవేశించకుండా ఎవరినీ ఆపే హక్కు ఎవరికీ లేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న విభేదాలను తాము పరిష్కరించామని, గ్రామస్థులు సామరస్యపూర్వకమైన అవగాహనకు వచ్చేలా చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే కూడా దళితుల పక్షాన నిలిచి వారి ఆలయ ప్రవేశానికి అధికారులతో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని సూచించారు.

ఘటనపై మండిపడుతున్న దళిత సంఘాలు
ఈ ఘటనపై దళిత సంఘాలు మండి పడుతున్నాయి. ఇప్పటికి కూడా దేశంలో దళితులపై చిన్నచూపు కొనసాగుతుందని గుంజేపల్లి ఘటన స్పష్టం చేస్తుందని మండిపడుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా కులాల పేరుతో వివక్ష కొనసాగుతోందని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దళితులకు సపోర్టు చేసిన ఎమ్మెల్యే కనబడడం లేదు అంటూ పోస్టర్ వేసిన ఘనత కూడా అగ్రవర్ణాల వారిదే అంటూ పలువురు మండిపడుతున్నారు.

దళితుల ఆలయ ప్రవేశం పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్న ఎమ్మెల్యే
ఏది ఏమైనా గుంజేపల్లి లో దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అగ్రవర్ణాలవారు అడ్డుకున్న ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గుంజేపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. గ్రామంలో సున్నితంగా ఉన్న సమస్యలు కొందరు పక్కదారి పట్టించారని ఆమె మండిపడ్డారు. ఆధునిక కాలంలో కూడా దళితులు ఆలయంలోకి రానివ్వకపోవడం ఏమిటి అంటూ శింగనమల ఎమ్మెల్యే పద్మావతి విరుచుకుపడ్డారు.

కొందరు కులాల పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము సూచించామని అధికారులు చట్టప్రకారం ఏది ఉంటే అదే చేశారని కొందరు కులాల పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. హిందూ ధర్మంలో ఎక్కడా కులాల ప్రస్తావనే లేదని తెలిపిన ఆమె ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. తనపై పోస్టర్ వెయ్యటం కూడా కులాల రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యలు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications